ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థినిలకు ఇచ్చిన స్కూటీల హామీ ఎప్పుడు నెరవేర్చుకుంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కౌన్సిల్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నేడు వినూత్న నిరసన చేపట్టారు. స్కూటీల బొమ్మలు పట్టుకొని ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని నిలదీశారు. విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారంటూ శాసన మండలి ఆవరణలో కాంగ్రెస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.