బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై మరో సారి ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పులను, పార్టీ హామీలను, పాలనలో లోపాలను నిలదీస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ” ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు ! పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు ! పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు ! గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు ! ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు ! ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు ! ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు ! ప్రజలపై కేసులు.. ప్రజాప్రతినిధులపై కేసులు .. కేసులు .. కేసులు .. కేసులు.. కాసులు మీకు – కేసులు మాకు. సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు.. మాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చెయ్యాలి… అని కేటీఆర్ పేర్కొన్నారు.