బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ట్విట్టర్లో కేటీఆర్ తన అభిమానులతో ఆస్క్ కేటీఆర్ లో భాగంగా చర్చ నిర్వహించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల ఆకాంక్షలతో భవిష్యత్తులో పాదయాత్ర చేస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకొస్తామని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని ఆగ్రమం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో నష్టం నుంచి రాష్ట్రం కోలుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. కేటీఆర్ పాదయాత్రపై ప్రకటన చేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.