కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వందశాతం అబద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించాడు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. కాంగ్రెస్ చెప్పినవన్నీ అబద్ధాలు తప్ప ఇంకేం కావన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశం తెలంగాణ ప్రజలకు రెండు విషయాలను స్పష్టం చేసిందని, స్పష్టత లేని విధ్వంసకర ప్రభుత్వం, బీసీ డిక్లరేషన్ పేరుతో మీరు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. నిన్న సమర్పించిన డేటాపై ప్రభుత్వం క్లూలెస్గా ఉన్నప్పటికీ, 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం పని చేయాలనే ఉద్దేశ్యం మీకు ఎప్పుడూ లేదని స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా యూ-టర్న్ చేసి, ఆ తర్వాత సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి డబ్బులివ్వడంతో మీరు ఎంత నిబద్ధతతో ఉన్నారో స్పష్టంగా తెలియజేస్తుందని విమర్శించారు. మీ హామీలు, వాగ్దానాలు, ప్రకటనలన్నీ రాజకీయ కోణాలు తప్ప మరేమీ కాదని మరోసారి రుజువైందన్నారు. రాహుల్ గాంధీ పేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలని సూచించారు.