బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. గత పదేళ్ల కాలంలో గత రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణ భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా అవతరించిందని చంద్రబాబు అనేక సందర్భాల్లో ముక్తసరిగా అంగీకరించారని వెల్లడించారు. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. దయచేసి ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని తన అస్థిరమైన పూర్వ శిష్యుడికి అవగాహన కల్పించాలని కోరారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు వీడియోను పోస్టుకు జత చేశారు. కేటీఆర్ చేసిన ఈ పోస్టును మాజీ మంత్రి హరీష్ రావు రీపోస్ట్ చేశారు.