బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైన ఫార్ములా-ఈ రేసు కేసు ఊపందుకుంది. నేడు ఉదయం కేటీఆర్ ఈ కేసు విచారణలో భాగంగా ఏసీబీ ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఆయనతో పాటు ఆయన లాయర్ రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. కేటీఆర్ ను అధికారులు ప్రత్యేక గదిలో విచారించారు. కాగా, దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానని, తాను చేసిన ప్రతి పని హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకే చేశానని స్పష్టం చేశారు. తాను ఎలాంటి అవినీతి చేయలేదని, తనకు చట్టంపై గౌరవం ఉందని చెప్పారు.