స‌ర్కార్ గార‌డీలో సామాన్యులే స‌మిధ‌లు

తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ గార‌డీలో సామాన్యులే స‌మిధ‌లుగా మారుతున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ ప‌నితీరుపై కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అధికారం కోసం
ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం అంటార‌ని, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటార‌ని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్ లో అరాచకం సృష్టించార‌న్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతకు పాల్ప‌డ్డార‌ని చెప్పారు. దీని ఫలితంగా తెలంగాణ‌లో రిజిస్ట్రేష‌న్లు పాతాళానికి పడిపోయాయ‌ని తెలిపారు. రాష్ట్ర ఖ‌జానా ఖాళీ అయిపోయి ఆదాయం అడుగంటిపోయింద‌న్నారు. ఎన్నిక‌ల హామీల‌న్నీ గాలికి వ‌దిలేసి ల‌క్ష‌న్న‌ర కోట్ల అప్పులు చేసి పెట్టార‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ పాల‌న‌లో ఇప్పటికే 15 నెల‌ల్లో ఎంతోమంది రియ‌ల్ట‌ర్లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *