తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో మరో కీలక ఘటన చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుపై మంగళవారం కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ హరీశ్రావుపై పంజాగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు హరీశ్రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్రావుతో పాటు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును చేర్చారు.