భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసానికి కాంగ్రెస్ తో పాటు పలు పార్టీల నాయకులు వరుసకట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ దంపతులు మన్మోహన్కు నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీతో, గాంధీ కుటుంబంతో మన్మోహన్కు మంచి సంబంధాలున్నాయి.