తెలుగు రాష్ట్రాల్లో మ‌రో ఎన్నిక‌ల న‌గారా!

తెలుగు రాష్ట్రాల్లో మ‌రో ఎన్నిక‌ల‌కు ఈసీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ప‌ది మంది ఎమ్మెల్సీల ప‌ద‌వీ కాలం ముగియ‌నుండ‌టంతో ఆయా స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈసీ మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయ‌నుంది. అదే నెల 10న‌ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించి వాటిని 11వ తేదీన ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణకు మార్చి 13 వ‌ర‌కు గ‌డువు ఇవ్వ‌నున్నారు. మార్చి 20న ఎన్నిక‌లు నిర్వ‌హించి అదే రోజు సాయంత్రం లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. మార్చి చివ‌రిక‌ల్లా ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, అశోక్‌బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం ముగుస్తుంది. ఇక తెలంగాణ‌లో మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హాసన్‌ల ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *