రాష్ట్రంలో గ్రూప్ 1 వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో అశోక్ నగర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. అశోక్ నగర్ వెళ్లి అభ్యర్థులను పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అభ్యర్థులతో కలిసి సెక్రటేరియట్కు ర్యాలీగా బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. గ్రూప్-1 బాధితులకు న్యాయం చేయాలంటూ బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించారు. అభ్యర్థులను కొడుతున్నారంటూ పోలీసుల పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ పోలీసులతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలు వివరించేందుకు సచివాలయానికి వెళ్తున్నామని చెప్పారు. పోలీసులు అడ్డుకోవద్దని ఎట్టి పరిస్థితుల్లోనైనా సచివాలయానికి వెళ్లి సీఎంను కలవాల్సిందేనని చెప్పారు. దీంతో పోలీసులు బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్నారు.