భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఒకే స్కూళ్లో చదువుతున్న ఇద్దరు బాలబాలికల చాటింగ్ వ్యవహారం బాలుడి ప్రాణం పోయేలా చేసింది. వివరాళ్లోకి వెళ్తే… మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండాకు చెందిన మనోజ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న పల్లవితో మనోజ్ స్నేహం చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కొద్దిరోజుల నుంచి వాట్సాప్ లో చాటింగ్ చేసుకుంటున్నారు. ఇది గమనించిన పల్లవి తల్లిదండ్రులు మనోజ్కు ఫోన్ చేసి హెచ్చరించారు. దీంతో మనోజ్ ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.