ఎమ్మెల్యే చింత‌మ‌నేనిపై సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌

టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై సీఎం చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌నం అధికారంలో ఉన్నామ‌న్న సంగ‌తి గుర్తు పెట్టుకోవాల‌ని క్లాస్ పీకారు. ఇటీవ‌ల ఎమ్మెల్యే చింత‌మ‌నేని ఓ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి వైసీపీ నేత అబ్బ‌య్య చౌద‌రి కూడా హాజ‌ర‌య్యారు. అయితే ప్ర‌భాక‌ర్ కారుకు అబ్బ‌య్య కారు అడ్డుగా ఉండ‌టంతో అక్క‌డ గొడ‌వ త‌లెత్తింది. దీనికి సంబంధించిన వీడియో సైతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న గురించి వివ‌రించేందుకు ఎమ్మెల్యే చింత‌మ‌నేని శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు వెళ్లారు. వైసీపీ నేత‌లు ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే గొడ‌వ జ‌రిగేట‌ట్లు ప్ర‌వ‌ర్తించార‌ని చెప్పారు. చింతమనేని బూతులు మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో సీఎం చంద్ర‌బాబు చింత‌మ‌నేనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మున్ముందు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా వ్య‌వ‌హ‌రించాల‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *