తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఘటనా స్థలాన్ని నేడు సీఎం చంద్రబాబు పరిశీలించారు.స్థానిక అధికారులతో మాట్లాడి ఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ పెరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. క్షతగాత్రులకు అందుతున్న సహాయ సహకారాల గురించి వివరాలు తెలుసుకున్నారు.