భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిష నేడు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అండర్ 19 మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించిన త్రిషను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా త్రిషకు సీఎం రూ.కోటి బహుమతిగా ప్రకటించారు. అండర్ 19 ప్రపంచ కప్ టీమ్లో మరో సభ్యురాలు ధ్రుతి కేసరి, టీమ్ హెడ్కోచ్ నౌషీన్, శిక్షకురాలు షాలినికి రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. త్రిషను సత్కరించి మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు.