భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మన్మోహన్ ను స్మరించుకుంటూ ప్రసంగించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోగానే ఆయన సతీమణి దగ్గరికి వెళ్లి నేను రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రిని అని పరిచయం చేసుకొని మాట్లాడానని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందని, మన్మోహన్ సింగ్ కు తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించండి అని ఆమె సూచించినట్లు తెలిపారు.