సీఎం రేవంత్ రెడ్డి నేడు కొడంగల్లోని పోలేపల్లిలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేయించి, ఆశీర్వచనం ఇచ్చి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులున్నారు.