తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వేములవాడలో రూ.127.65 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. గుడి చెరువులో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని మాట్లాడనున్నారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తదితరులున్నారు.