కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలోని వరంగల్లో పర్యటించనున్నారు. నేడు సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని హన్మకొండకు రానున్నారు. పార్టీ స్థానిక నేతలతో రాహుల్ సమావేశం కానున్నారు. అనంతరం రాహుల్ కాజీపేట నుంచి రైలులో తమిళనాడు వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి రైలులో వస్తున్న విద్యార్థులతో రాహుల్ మాట్లాడనున్నారు. వరంగల్ నుంచి చెన్నై వరకు విద్యార్థులతో కలిసి ప్రయాణం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు హన్మకొండకు వెళ్లనున్నారు.