కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ షో కాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వే గురించి మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు అన్యాయం చేసే విధంగా సర్వే వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది కుల గణన సర్వే కాదని, కేవలం అగ్ర కులసర్వే అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా బీసీలంతా కలిసి కుల గణన సర్వే రిపోర్టును తగలబెట్టాలని పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఉండి ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా క్రమశిక్షణకు లోబడే ఉండాలని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మల్లన్న కాంగ్రెస్ పార్టీనో కాదో తేల్చుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. షోకాజ్ నోటీసులపైనా మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి మీరేవరంటూ ఫైర్ అయ్యారు.