తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేసిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు ఆ పార్టీ షాకిచ్చింది. పార్టీ నుంచి మ‌ల్ల‌న్నను స‌స్పెండ్ చేసింది.తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి తీన్మార్ మ‌ల్ల‌న్న వైఖ‌రి ఒకింత విభిన్నంగానే ఉంది. పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటూనే సొంత పార్టీ నేత‌ల‌పై, పార్టీ విధానాల‌పై ప‌లు సార్లు విమ‌ర్శ‌లు చేశారు. ఈ మేర‌కు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడంటూ ఫిబ్రవరి 5న మ‌ల్ల‌న్న‌కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ప‌లు స‌భ‌ల్లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌ర్వే గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేప‌ట్టినందుకు ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కానీ మ‌ల్ల‌న్న ఈ నోటీసుల‌పై సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. నాకు నోటీసులు ఇవ్వ‌డానికి మీరెవ‌రంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోయే స‌రికి పార్టీ నుంచి మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *