కొరియోగ్రాఫ‌ర్ జానీకి బెయిల్ మంజూరు

అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ అయి జైలులో ఉన్న టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ కు బెయిల్ లభించింది. టాలీవుడ్‌కు చెందిన ఓ మ‌హిళా కొరియోగ్రాఫ‌ర్ ఫిర్యాదుతో జానీ మాస్ట‌ర్‌పై కేసు న‌మోదైంది. ఆయ‌న‌ను అరెస్ట్ చేసిన పోలీసులు చంచ‌ల్‌గూడ జైలులో ఉంచారు. స‌ద‌రు మ‌హిళా కొరియోగ్రాఫ‌ర్ మైన‌ర్‌గా ఉన్న స‌మ‌యంలోనే జానీ మాస్ట‌ర్ ఆమెపై అత్యాచారం చేయ‌డంతో పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు.దీంతో గ‌త రెండు వారాలుగా జానీ జైలులో ఉన్నారు. కాగా, జానీ 2022లో ఉత్త‌మ కొరియోగ్రాఫ‌ర్‌గా జాతీయ ఉత్త‌మ కొరియోగ్రాఫ‌ర్ అవార్డుకు ఎంపిక‌య్యారు. ఈ అవార్డు ఫంక్ష‌న్ ఇటీవ‌ల జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు జానీకి కోర్టు నాలుగు రోజుల బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఆయ‌న‌పై కేసు న‌మోదైన కార‌ణంగా జాతీయ అవార్డుల క‌మిటీ దాన్ని హోల్డ్ లో పెట్టింది. దీంతో ఆయ‌న జైలు నుంచి బ‌య‌ట‌కు రాలేదు. మొత్తానికి నేడు జానీ చంచ‌ల్‌గూడ జైలు నుంచి బ‌య‌ట‌కు రానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *