ఇటీవల కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు షాకిచ్చింది. వంశీని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు నేడు ఆదేశాలు జారీ చేసింది.వెన్ను నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందిస్తూ.. వంశీకి బెడ్, వెస్ట్రన్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. ఇక వంశీని ప్రతి రోజు లాయర్ సమక్షంలోనే విచారించాలని సూచించింది.