హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు తాగు నీటిని అందించే నల్గొండ జిల్లా పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పదుల సంఖ్యలో కోళ్ల కళేబరాలు దర్శనమివ్వడం కలకలం రేపింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందన్న వార్తల నేపథ్యంలో ప్రజలు ఈ ఘటనతో ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఇదే రిజర్వార్లో కోతులు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు చనిపోయిన కోళ్లు వేశారు. అధికారులు రిజర్వాయర్ను పరిశీలించి దాదాపు 80 చనిపోయిన కోళ్లను తొలగింపజేశారు. రిజర్వాయర్లో కోళ్లు ఎవరు వేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.