విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహించనున్న 35వ పుస్తక మహోత్సవాన్ని నేడు ప్రారంభించనున్నారు. జనవరి 12 వరకు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.