ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ జ్వరం కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేదు. కాగా, ఏపీ కేబినేట్ ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు అందులో లోటుపాట్లు సవరించేలా కొత్తం చట్టం తెచ్చే ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చించారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆమోదం తెలిపారు. టీటీడీలోని పోటులో పని చేసే వర్కర్లను సూపర్ వైజర్లుగా అప్ గ్రేడ్ చేయడం చర్చించారు. వీరికి సీనియర్ అసిస్టెంట్ కేడర్గా పదోన్నతి కల్పించేందుకు ప్రతిపాదించారు. తిరుపతిలోని చెన్నై–బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరాకు రూ.8 లక్షలు ఇచ్చేందుకు ప్రతిపాదించారు.