కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు పంపించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో కేటీఆర్ అవినీతికి పాల్ప‌డ్డాడంటూ ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. ఇటీవ‌ల ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. జనవరి 7న కేటీఆర్‌ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కేటీఆర్ తో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌కు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిల‌కు కూడా ఈడీ నోటీసులు అందాయి. జనవరి 2, 3న వారు విచారణకు హాజ‌ర‌వ్వాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *