ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని సూచించారు. మంత్రి నారా లోకేశ్ నేడు ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నో బ్యాగ్ డే గురించి ప్రస్తావిస్తూ పాఠశాలల్లో ప్రతి శనివారం కో కరిక్యులర్ యాక్టివిటీస్ పై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న అన్ని యాప్ల స్థానంలో ఒక్కటే ఉపయోగించేలా యాప్ రూపకల్పన చేయాలన్నారు. జీవో-117 ఉపసంహరణపై అధికారులతో చర్చించారు.