ఏపీ స్కూళ్ల‌లో ప్ర‌తి శ‌నివారం “నో బ్యాగ్ డే”

ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌ల్లో ప్ర‌తి శ‌నివారం నో బ్యాగ్ డే నిర్వ‌హించాల‌ని సూచించారు. మంత్రి నారా లోకేశ్ నేడు ఇంట‌ర్మీడియ‌ట్ విద్య‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నో బ్యాగ్ డే గురించి ప్ర‌స్తావిస్తూ పాఠ‌శాల‌ల్లో ప్ర‌తి శ‌నివారం కో క‌రిక్యుల‌ర్ యాక్టివిటీస్ పై ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ఆదేశించారు. ఉపాధ్యాయుల‌కు ప్ర‌స్తుతం ఉప‌యోగిస్తున్న అన్ని యాప్‌ల స్థానంలో ఒక్క‌టే ఉప‌యోగించేలా యాప్ రూప‌క‌ల్ప‌న చేయాల‌న్నారు. జీవో-117 ఉపసంహరణపై అధికారుల‌తో చ‌ర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *