మహారాష్ట్ర సీఎం పదవికి శివసేన అధినేత ఏక్నాథ్ షిండే నేడు రాజీనామా చేశారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడంతో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీయే సీఎం పీఠాన్ని అధిరోహిస్తుందని పలువురు బీజేపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి సీఎం కానున్నారు. కానీ దీనిపై అధికారికంగా కూటమి ప్రకటించలేదు. ఈ క్రమంలో షిండే రాజీనామా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండేనే కొనసాగించాలని శివసేన నేతలు పట్టుబడుతున్నారు.