వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు షాకిచ్చింది. ఓ మహిళ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న నందిగం సురేష్కు 14 రోజుల రిమాండ్ పొడిగించింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నేటితో నందిగం సురేష్ కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు ఆయనను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టి విచారణకు మరింత సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు నవంబర్ 4 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం నందిగం సురేష్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్ లభించిన వెంటనే నందిగం సురేష్ను పోలీసులు మరియమ్మ హత్య కేసులో అరెస్ట్ చేశారు.