అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన పట్టా భూమిని ఆన్లైన్ చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వాల్మీకిపురం మండలం టేకలకోనలో ఈ విషాదకర ఘటన జరిగింది. వెంకటాద్రి తన తండ్రి నుంచి సంక్రమించిన మిలిటరీ పట్టా భూమిని రెవెన్యూ అధికారులు ఆన్లైన్ లోకి ఎక్కించాలని పలుమార్లు కోరాడు. అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చేతి పైన, సూసైడ్ లెటర్ లో తన చావుకు కారణం రెవెన్యూ అధికారులు, గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తుల అని వారి పేర్లు రాసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వెంకటాద్రి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.