సంధ్య థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చారు. నేడు ఉదయం అల్లు అర్జున్ తన నివాసం నుంచి తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్రెడ్డి, నిర్మాత బన్నీ వాసు, తన లీగల్ టీంతో కలిసి స్టేషన్కు వచ్చారు. పోలీసులు సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ను విచారించనున్నారు. అవసరమైతే అల్లు అర్జున్ను సంధ్యా థియేటర్కు కూడా తీసుకెళ్లనున్నారని సమాచారం.