కిమ్స్ కు సినీ న‌టుడు అల్లు అర్జున్

ప్ర‌ముఖ సినీ న‌టుడు అల్లు అర్జున్ నేడు బేగంపేట్‌లోని కిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ఇటీవ‌ల పుష్ప సినిమా విడుద‌ల స‌మ‌యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద‌ తొక్కిస‌లాట‌లో ఓ మ‌హిళ మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఆమె కుమారుడు శ్రీతేజ్ సైతం తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ఆ బాలుడు బేగంపేట్‌లోని కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేప‌థ్యంలో బాధిత బాలుడిని ప‌రామ‌ర్శించేందుకు అల్లు అర్జున్ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. దీని కోసం ముందుగానే పోలీసుల అనుమ‌తి సైతం తీసుకున్నారు. అల్లు అర్జున్ రాక‌తో పోలీసులు ఆస్ప‌త్రికి వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *