దేశ రాజ‌ధాని ఢిల్లీలో బాణ‌సంచాపై నిషేధం

వాతావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా ఢిల్లీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా ఈ ఏడాది బాణ‌సంచా త‌యారీ, అమ్మ‌కాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్యాన్ని అరిక‌ట్టేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రానున్న దీపావ‌ళి వేడుక‌ల సంద‌ర్భంగా అన్ని ర‌కాల బాణ‌సంచాపై ఈ నిషేధం కొన‌సాగ‌నుంది. బ‌హిరంగ మార్కెట్ల‌లో అమ్మ‌కాల‌తో పాటు, ఢిల్లీలో ఆన్‌లైన్ అమ్మ‌కాల‌పై కూడా నిషేధం ఉంటుంది. ఈ మేర‌కు ఢిల్లీ పొల్యూష‌న్ కంట్రోల్ క‌మిటీ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జనవరి 1, 2025 వరకు అమలులో ఉంటుంద‌ని ఉత్త‌ర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, దీపావళి సంద‌ర్భంగా ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించడం ఇది నాలుగోసారి. ప్ర‌జలంతా త‌ప్ప‌నిస‌రిగా నిబంధ‌న‌లు పాటించాల‌ని, లేదంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *