ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ఉద్ధృతి తీవ్రమైంది. దీంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. అధికారులు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు పది అడుగులు మేర ఎత్తి వేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 22 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పంట కాలువలకు కూడా నీటిని వదులుతున్నారు. మరో వైపు జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.