ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, వైయస్ జగన్ రెండో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆశించినట్లు తెలిపారు. కానీ ఊహించని విధంగా ఘోరంగా ఓడిపోయామన్నారు. కానీ 11 సీట్లు మాత్రమే రావడం ఊహించలేదన్నారు. కేవలం 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయో అర్థం కాలేదని, అలాగే కూటమికి 164 సీట్లు ఎందుకు వచ్చాయో వాళ్లకు కూడా అర్థం కాలేదని చెప్పారు. ఏది ఏమైనా ఓటమిని అంగీకరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.