కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో దేవుళ్లకు కూడా మొండి చేయి చూపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ధూప దీప నైవేద్యాలకు కూడా ప్రభుత్వం పైసలు ఇస్తలేదని, రెండు నెలలుగా డీడీఎన్ ఫండ్స్ విడుదల కాలేదని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని జోడిస్తూ హరీష్ రావు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. కాంగ్రెస్ సర్కార్ దేవుళ్ళకు కూడా మొండి చెయ్యి చూపిందని, ధూప, దీప నైవేద్యాలకు పైసలు లేక, ఉద్దెరకు పూజ సామగ్రి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. రెండు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.