తిరుమల తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్ష వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తిరుమల చరిత్రలో ఏనాడూ ఇలా జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం జరిగిందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అసమర్థత కారణంగానే ఇలా జరిగిందన్నారు. ప్రభుత్వానికి భక్తులకు సేవ చేయాలన్న ఉద్దేశ్యం లేదని విమర్శించారు. తిరుమలలో భక్తులకు కనీస సదుపాయాలు కూడా లేవన్నారు. తిరుమల లడ్డుపై బీజేపీ, టీడీపీ నేతలు రాజకీయం చేశారని, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనకు ఏ ప్రాయశ్చిత్తం చేస్తారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుతో రాజీనామా చేయిస్తారా లేదా మీరు చేస్తారా? అని ప్రశ్నించారు.