మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ నేడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. వైయస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చటం లేదని వెల్లడించారు. వైయస్ జగన్ పార్టీలో ఏ బాధ్య అప్పగించినా చేస్తానని, రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.రానున్న రోజుల్లో మరింత మంది కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు.