టీడీపీ నాపై దుష్ప్ర‌చారం చేస్తోంది – తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి

టీడీపీ కార్య‌క‌ర్త‌లు త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. త‌న‌కు కూతురు వరుస అయ్యే బంధువు సుమయ రెడ్డి అనే అమ్మాయితో సంబంధాలు అంటగడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రేపు రామగిరి మండలానికి జ‌గ‌న్‌ వస్తున్న సందర్భంగా టీడీపీ దురాగతాలపై గొంతు ఎత్తడానికి స్వచ్ఛందంగా వేలాదిగా ప్రజలు తరలివచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండటంతో జ‌గ‌న్‌ రామగిరి మండలంలోకి రానివ్వకుండా అడ్డుకునే పరిస్థితి కనపడకపోవడంతో త‌న‌ సమీప బంధువులు త‌న‌ కుటుంబ సభ్యులందర్నీ నీచపు రాజకీయ క్రీడలో కి లాగుతున్నార‌న్నారు. ఓ వీడియో తాను ఎయిర్ పోర్టులో బంధువుల అమ్మాయితో మాట్లాడుతుండగా వీడియో వైరల్ చేసి నీచానికి పాల్పడుతున్నార‌న్నారు. ఎవరైతే ఆ వీడియోని అప్లోడ్ చేస్తారో పోస్టులు పెడుతున్నారో వారందరి మీద పోలీసులు ఫిర్యాదు చేసి చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెప్పారు. దాదాపుగా 25 సంవత్సరాల త‌న‌ రాజకీయ జీవితంలో సంపాదించుకున్న గౌరవ మర్యాదలు న‌ష్ట‌ప‌రిచేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, ఈ విష ప్రచారాన్ని ప్ర‌జ‌లు నమ్మే పరిస్థితిల్లో లేర‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *