వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గత అక్టోబర్ 7న అరెస్ట్ అయిన నందిగం సురేష్ దాదాపు 145 రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా మంగళవారం ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో నేడు జైలు నుంచి విడుదలయ్యాడు. నందిగం సురేష్ పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న నేపథ్యంలో ఆయనను కుటుంబసభ్యులు నేరుగా విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు.