వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఏపీ సీఐడీ విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో విజయసాయిరెడ్డిని సీఐడీ అధికారులు విచారించారు. గతంలో ఇదే కేసులో ఆయనను ఈడీ సైతం విచారించింది. వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ , కాకినాడ సెజ్ లలో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను తన నుంచి బలవంతంగా రాయించుకున్నారని యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ విజయసాయిరెడ్డి , విక్రాంత్ రెడ్డిలపై కేసు నమోదు చేసింది.