తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని రెండు పడక గదుల ఇళ్ల విక్రయాలనికి సంబంధించిన కేసులో పోలీసులు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. సెప్టెంబర్ 2న మహబూబ్నగర్ క్రిస్టియన్పల్లి శివారులోని ఆదర్శనగర్లో 523 సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ భూముల్లో అక్రమాలు జరిగాయని తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా నాలుగో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి తమ్ముడు శ్రీకాంత్ కొద్ది రోజులుగా పరారీలో ఉన్నారు.ఈ క్రమంలో శ్రీకాంత్ హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు హైదరాబాద్ వెళ్లగా.. అంతలోపే శ్రీనివాస్గౌడ్ స్వయంగా తన వాహనంలో శ్రీకాంత్ను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. శనివారం శ్రీకాంత్గౌడ్ను జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కోర్టుకు తరలించారు. 14 రోజుల రిమాండ్ విధించగా మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించారు.