రాజ‌మండ్రిలో మ‌హిళ‌పై గ్యాంగ్ రేప్.. హ‌త్య‌

రాజ‌మండ్రిలో ఇటీవ‌ల అనుమానాస్ప‌దంగా మృతి చెందిన‌ ఓ మ‌హిళ కేసులో దారుణ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. మ‌హిళ‌పై కొంద‌రు సామూహిక అత్యాచారం చేసి హ‌త్య చేశార‌ని పోలీసులు తేల్చారు. వివ‌రాళ్లోకి వెళ్తే..
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన కూలీ రౌతు కస్తూరి అక్టోబ‌ర్ 15న చొప్పెల్ల లాకుల వద్ద మృతి చెందింది. పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్నారు. క‌స్తూరి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో పోస్టు మార్టం రిపోర్టులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆమెపై న‌లుగురు అత్యాచారం చేసి, అనంత‌రం హ‌త్య చేసిన‌ట్లు వెల్ల‌డైంది. బుర్రిలంకకు చెందిన దేవర యేసులోకి జయప్రసాద్, వెలుబుడి ప్రవీణ్, పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్‌ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. మద్యం మత్తులో వీరు క‌స్తూరిపై లైంగికదాడి చేసి ఆ తర్వాత చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చొప్పెల్ల లాకుల‌ వద్ద మృతదేహం లభించాక అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో పోస్టు మార్టం రిపోర్టులో వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *