హైదరాబాద్లోని ప్రముఖ హోటల్ తాజ్ బంజారాను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా హోటల్ యాజమాన్యం పన్నులు చెల్లించడం లేదని తెలిపారు. దీనిపై ఇప్పటికే పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశామని, అయినా స్పందించలేదని పేర్కొన్నారు. చివరికి రెడ్ నోటీసులు కూడా ఇచ్చామన్నారు. దీంతో చేసేదేం లేక హోటల్ను సీజ్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. గత రెండేళ్ల నుంచి తాజ్ హోటల్ రూ.1.40 కోట్ల పన్నులు బకాయిలు ఉన్నట్లు చెప్పారు.