సీఈసీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ్ఞానేశ్‌ కుమార్‌

భారత ఎన్నికల సంఘం క‌మిష‌న‌ర్‌గా జ్ఞానేశ్‌ కుమార్ నేడు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మంగళవారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… దేశ నిర్మాణానికి మొదటి అడుగు ఓటేన‌న్నారు. 18 ఏళ్లు నిండిన భారత పౌరులంతా ఓటర్లుగా మారాల‌ని, ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా ఓటు వేయాల‌ని చెప్పారు. జ్ఞానేశ్‌ కుమార్‌ కేరళ క్యాడర్‌కు చెందిన ‌1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడు. ఆయ‌న‌ హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా ప‌ని చేసి గతేడాది జనవరి 31న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. అనంత‌రం గ‌తేడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. 2029 జ‌న‌వ‌రి 26 వ‌ర‌కు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *