రాజకీయ నేతలు ఎవరి గురించైనా నోటికొచ్చినట్లు మాట్లాడడానికి ఇది ముందున్న ప్రభుత్వం కాదని, ఎవరు తప్పుగా మాట్లాడినా శిక్ష తప్పదని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనంతపురంలో నిర్వహించిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని మాట్లాడారు. నోరుంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లడటానికి ఇంతకు ముందున్న ప్రభుత్వం కాదు… ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాం అంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం… ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్లు ఎవరైనా శిక్ష ఓకే విధంగా ఉంటుంది.. అని పేర్కొన్నారు. ఇక కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ ప్రకారం ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరన్నారు. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులున్నాయని, కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా.. అనుభవించేది రాజానే అని సెటైర్లు వేశారు.