తెలంగాణలో ప్రభుత్వ భూములు, చెరువులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో నేడు హైడ్రా అధికారులు పర్యటించారు. 296 సర్వే నెంబర్ లోని గాయత్రి వెంచర్ పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మించిన షెడ్డును అధికారులు కూల్చివేశారు. శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు ముత్తంగి గ్రామానికి చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు.