నగరంలో హైడ్రా కూల్చివేతలు స్థానికులను కలవరపెడుతున్నాయి. నేడు ఉదయం ఖాజాగూడలో బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో ఉన్న పలు వ్యాపార, వాణిజ్య సముదాయాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. తమకు నోటీసులు ఇచ్చిన 24 గంటలకే కూల్చివేతలు చేపడుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని ఉన్నామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హైడ్రా అధికారులు మాత్రం ఈ నిర్మాణాలు ఖాజాగూడ చెరువు బఫర్ జోన్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 20కిపైగా దుకాణాలను తొలగించారు. బాధితుల ఆందోళనలతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.