దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీచైతన్యలో అక్రమ లావాదీవీలు జరిగినట్లు పలు ఆరోపణలు రావడంతో సోమవారం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మంగళవారం రెండో రోజు కూడా దాడులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లోని కాలేజీ బ్రాంచీల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న శ్రీచైతన్యలో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని టాక్స్ చెల్లించకుండా ఎగవేస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. దీని కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకొని లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి కట్టే టాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నారు.